ఆగిన అభివృద్ధి ఉపఎన్నికల ఫలితాలతో పరుగు: మునుగోడు ఎమ్మెల్యే

by Dishanational1 |
ఆగిన అభివృద్ధి ఉపఎన్నికల ఫలితాలతో పరుగు: మునుగోడు ఎమ్మెల్యే
X

దిశ, చౌటుప్పల్: ఆగిన అభివృద్ధి మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండలం ఆరెగూడం, అంకిరెడ్డిగూడం, లింగోజీగూడం, ధర్మోజీగూడం, ఎల్లగిరి, ఖైతపురం, మల్కాపురం, తుప్రాన్ పేట గ్రామాలలో సుమారు ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని చూసి పలు రాష్ట్రాల నుండి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే అది కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed