మూసీ నదిలో మృతదేహం లభ్యం

by Bhanu |

మండలంలోని సంగెం గ్రామ శివారు భీమ లింగం కత్వ సమీపంలో మూసీ నదిలో బుధవారం మృతదేహం లభ్యమయింది.

మూసీ నదిలో మృతదేహం లభ్యం
X

దిశ, వలిగొండ: మండలంలోని సంగెం గ్రామ శివారు భీమ లింగం కత్వ సమీపంలో మూసీ నదిలో బుధవారం మృతదేహం లభ్యమయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఎస్సై యుగేందర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకి తీసి గుర్తించగా భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం చెందిన బేర సురేష్ (40)గా గుర్తించారు. మృతుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, మృతిని మెడ చుట్టూ గాయాలై మూసీ నదిలో శవమైతేలాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గ్రామ పంచాయతీ సెక్రెటరీ జితేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Next Story