- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేటితో ముగియనున్న గడువు.. అధికారుల చర్యల పై సర్వత్రా ఆసక్తి
by Disha Web Desk 12 |
X
దిశ, చండూరు: మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు అక్రమంగా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ప్రజలలో విపరీతమైన చర్చ జరగడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ నెల 3 వ తేదీన నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందించినప్పటి నుండి 7 రోజుల్లో జిల్లా విగ్రహ ఏర్పాటు కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని లేనిచో చర్యలు తీసుకుంటామని అందులో తెలిపారు. నేటితో గడువు ముగుస్తుండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం మరికొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందిని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Next Story