జిట్టా ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు చేరిక

by Dishafeatures2 |
జిట్టా ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు చేరిక
X

దిశ, భువనగిరి రూరల్: బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి, భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ చిక్క క్రిష్ణా ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణ వాళ్లకు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోటోళ్ల శ్యామ్ గౌడ్, సురకంటి రంగారెడ్డి, కడెం సాయిలు, కొమ్ము భాను, మైసగోని వెంకటేష్ గౌడ్, కసాని వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed