పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.. కుంభం

by Disha Web Desk 20 |
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.. కుంభం
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీధ్యేయమని భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో సీపీఐ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రవేశపెట్టిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తోందన్నారు. సీపీఐ పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్ గెలుపు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, మాజీ జడ్పీచైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎండీ ఇమ్రాన్, యేశాల అశోక్, పొత్నక్ ప్రమోద్ కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed