బాధిత జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం

by Kodari Anjali |

పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు బుయ్య శివనాగరాజు అనారోగ్యంతో మరణించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించారు.

బాధిత జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి: పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు బుయ్య శివనాగరాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సహాయనిధి నుండి ఒక లక్ష రూపాయలు జర్నలిస్టు శివ నాగరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రతి నెల ఐదేళ్లపాటు పెన్షన్ అందుతుందని తెలిపారు. ఈ సాయంపై కుటుంబ సభ్యులు, జర్నలిస్టుల సంఘాలు, ప్రెస్ అకాడమీ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story