- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర రోడ్డు ప్రమాదం: భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు
by Disha Web Desk 11 |
X
దిశ, మాడుగులపల్లి: మండల పరిధి కుక్కడం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ధైద వెంకన్న, భార్య లక్ష్మిరేఖ (32)తో కలిసి ద్విచక్ర వాహనంపై నల్లగొండ పట్టణంలో ఇంటర్ చదువుతున్న తమ కూతురును చూడడానికి మిర్యాలగూడ నుంచి నల్లగొండ వెళుతున్నారు.
ఈ క్రమంలో కుక్కడం వద్దకు రాగానే వెనక వైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో పాటు కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో భార్య లక్ష్మిరేఖ అక్కడికక్కడే మృతిచెందగా, వెంకన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108 సాయంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story