వేగమైన వార్తలతో దిశ ముందంజ : వ‌ట్టే జాన‌య్య యాద‌వ్

by Ratna Kumari |

వేగవంతమైన వార్తలతో రెండు తెలుగు రాష్ట్రాలలో తక్కువ కాలంలోనే దిశ దిన పత్రిక లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్నదని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు.

వేగమైన వార్తలతో దిశ ముందంజ : వ‌ట్టే జాన‌య్య యాద‌వ్
X

దిశ, సూర్యాపేట : వేగవంతమైన వార్తలతో రెండు తెలుగు రాష్ట్రాలలో తక్కువ కాలంలోనే దిశ దిన పత్రిక లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని చూరగొన్నదని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. వార్తలను పక్షపాతం లేకుండా అందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తోందని ప్రశంసించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో దిశ 2026 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. . కాలానికనుగుణంగా మార్పు చెందుతూ ఎంతో మందికి ఉపాధి చూపుతున్న దిశ, జర్నలిజంలో కొత్త ఒరవడి సృష్టిస్తుందన్నారు. ఇలాంటి పత్రికలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్లు తండ నాగేందర్, రావుల రాజు, బొలికొండ వీరస్వామి,కొంగల సతీష్, కుమ్మరి కుట్ల నాగరాజు, టీఆర్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Next Story