యువతితో కానిస్టేబుల్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య

by Web Desk |
యువతితో కానిస్టేబుల్ ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పొట్టు పొట్టు కొట్టిన భార్య
X

దిశ, నల్లగొండ: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బంధువులతో కలిసి కానిస్టేబులైన తన భర్తపై భార్య దాడికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం సంచలనం రేపగా, పోలీసు అధికారులకు ఒక్కసారిగా ఉలిక్కిపాటును కలిగించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాకు నాగార్జున సాగర్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డీఎల్ ప్రసాద్, మిర్యాలగూడ బంగారు గడ్డకు చెందిన శాంతకుమారితో 16 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 15, 13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. డీఎల్ ప్రసాద్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉండే సమయంలో రాధిక అనే యువతితో వివాహేతర సబంధం ఏర్పడింది. ఇలాంటి పనులు మానుకోవాలని తన భర్తను ప్రశ్నించగా, ఘర్షణ జరగడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దని హెచ్చరించి పంపించారు. కానీ.. తన భర్త రాధికతో గోప్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆమె 2017 సెప్టెంబర్ 2న మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అప్పటినుంచి శాంతకుమారి మిర్యాలగూడలోని తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తన భర్త ప్రసాద్ తన పిల్లలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుంది. తన కుటుంబసభ్యులతో కలిసి రాధిక, డీఎల్ ప్రసాద్ కాపురం చేస్తున్న పానగల్ బైపాస్ లో వారి ఇంటికి వచ్చి దాడికి దిగగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుటాహుటినా టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని శాంతకుమారి బంధువులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీ రెమారాజేశ్వరిని శాంతకుమారి కోరింది. రాధిక, ప్రసాద్ కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

Next Story

Most Viewed