కాంగ్రెస్ పార్టీ సీపీఐకి పూర్తిసహకారం అందిస్తుంది.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

by Disha Web Desk 20 |
కాంగ్రెస్ పార్టీ సీపీఐకి పూర్తిసహకారం అందిస్తుంది.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..
X

దిశ, చిలుకూరు : ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ సీపీఐకి పూర్తిసహకారం అందిస్తుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం చిలుకూరు సీపీఐ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీపీఐకి కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందని ఎంపీ అన్నారు. బీఆర్ఎస్ ప్రజా కంటక పాలనకు చరమగీతం పాడాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో కోదాడ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు, ఎంపీపీ బండ్ల ప్రశాంతి కుమారి కోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, చిలుకూరు సర్పంచ్ కొడారు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు మండవ శైలజ మధు, వి.ధనమూర్తి, సైదాబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి పిండ్రాతి హనుమంతరావు, పొందూరు రమేష్, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకటరెడ్డి, బేతవోలు సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, సీపీఐ గ్రామ కార్యదర్శులు సాహెబ్ అలీ, చిలువేరు ఆంజనేయులు పి.గంగాధర్ రావు, మండవ కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed