పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేద‌ల‌కు అండ‌గా ఉంటుంద‌ని భువ‌న‌గిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి : నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శ్రీరాములు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2,50,000 ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమళ్ళ మహాలక్ష్మి దానయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, గుడిసె నాగభూషణ్, తోట శ్రీనివాస్, ఆకుల సులోచన అంజయ్య, అల్లూరి శివ పాల్గొన్నారు.

Next Story