స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఆర్డీవో శేఖర్ రెడ్డి

by Bhanu |

ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో సమ భావన సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:  ఆర్డీవో శేఖర్ రెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో సమ భావన సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story