కారు ఢీకొని వ్యక్తి మృతి

by Bhanu |   (  Updated:2025-05-02 14:54:59  IST  )

కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిచర్లపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కారు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

కారు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిచర్లపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కారు ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలకు వెళ్తే పెద్దఅడిచెర్లపల్లి మండలం మేడారం గ్రామపంచాయతీకి చెందిన చేన్నమౌని సత్యం (55) తన ద్విచక్ర వాహనంపై చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇదే క్రమంలో పని నిమిత్తం కొండమల్లేపల్లి కి వచ్చి తన ద్విచక్రవాహనపై సొంత గ్రామానికి వెళుతుండగా చిన్నోడు చిన్నఅడిచర్లపల్లి గ్రామ సమీపంలో సంజీవని ట్రస్టు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన కారును ఢీకొట్టడంతో చందమామిడి సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మిత్రునికి భార్య అంజమ్మ కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భారీ అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ముత్యాల రామ్మూర్తి తెలిపారు


Next Story