జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శికి సన్మానం

by Ratna Kumari |

దిశ, చిట్యాల : చిట్యాల మండ‌లం బొంగోని చెరువు గ్రామ‌పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి తాటికొండ లింగస్వామి జిల్లా ఉత్తమ కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స‌ర్పంచ్, పాల‌క వ‌ర్గం స‌భ్యులు మంగ‌ళ‌వారం సత్క‌రించారు.

జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శికి సన్మానం
X

దిశ, చిట్యాల : చిట్యాల మండ‌లం బొంగోని చెరువు గ్రామ‌పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి తాటికొండ లింగస్వామి జిల్లా ఉత్తమ కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స‌ర్పంచ్, పాల‌క వ‌ర్గం స‌భ్యులు మంగ‌ళ‌వారం సత్క‌రించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకమైనదని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సామిడి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు తీగల శ్రీధర్ రెడ్డి, బండారు రాఘవరెడ్డి, బిక్షపతి, అశోక్ రెడ్డి, కట్ట సత్యనారాయణ పాల్గొన్నారు.

Next Story