- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషపూరిత పాల వ్యాపారం భగ్నం.. మన్నెవారుపంపులో కల్తీ మాఫియా అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెవారూపంపు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిపై గురువారం భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెవారూపంపు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిపై గురువారం భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, సామల సత్తిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద కల్తీ పాలను తయారు చేస్తూ, వాటిని హైదరాబాద్కి సరఫరా చేస్తున్నాడని భువనగిరి రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో అందిన సమాచారం ఆధారంగా పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టి, ఘటనాస్థలంలో 80 లీటర్ల కల్తీ పాలు, 5 కిలోల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఈ కల్తీ పదార్థాలతో వ్యాపారం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్తీ పాల ఉత్పత్తిపై నిషేధం విధించామని, ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు.






