ప్రాణం తీసిన వడ్లు తూర్పార మెషిన్.. మహిళా కూలీ మృతి

by Disha Web Desk 20 |
ప్రాణం తీసిన వడ్లు తూర్పార మెషిన్.. మహిళా కూలీ మృతి
X

దిశ, బొమ్మలరామారం: వడ్లు తూర్పార పట్టే మెషిన్‌లో చిక్కుకొని మహిళా కూలి మృతి చెందిన సంఘటన మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ కన్నెబోయిన మాధవి (36) కూలి పనిలో భాగంగా మండలంలోని మల్యాల గ్రామంలో బండపై వడ్లు తూర్పార పట్టడానికి వెళ్ళింది. వడ్లు మిషన్ లో పొస్తుండగా ప్రమాదవశాత్తూ మెషిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త కన్నెబోయిన రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిరుపేద వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న మాధవికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వపరంగా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed