- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని రహదారి
మండల కేంద్రం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే దారి సంవత్సరాల నుంచి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు చేరడంతో రహదారి వాడకంలో లేకుండా ప్రయాణికులు రాకపోకలను నిలిపివేశారు.

దిశ, మర్రిగూడ : మండల కేంద్రం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే దారి సంవత్సరాల నుంచి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు చేరడంతో రహదారి వాడకంలో లేకుండా ప్రయాణికులు రాకపోకలను నిలిపివేశారు. రెండు దశాబ్దాల క్రితం ఈ రహదారిని మర్రిగూడ మండల కేంద్రం నుంచి వట్టిపల్లి గ్రామపంచాయతీకి వెళ్లడానికి పాత రహదారి. అలాగే మండల వ్యాప్తంగా ప్రజలు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి కల్వర్టు తో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ రహదారి మరమ్మతుకు నిధులు మంజూరు చేయకపోవడంతో రహదారి గుంతలుగా ఏర్పడి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకల కు ఇబ్బందికరంగా ఏర్పడింది. గ్రామం నుంచి వచ్చే మురుగు నీరుతో పాటు వర్షాకాలంలో వచ్చిన నీరు ఆ కల్వర్టు గుండా వెళ్లకపోవడంతో గుంతల్లో చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వట్టిపెళ్లికి ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ , ఉపాధి హామీ కార్యాలయం తోపాటు మండల విద్యాధికారి కార్యాలయానికి వెళ్లే వారు ఆ రోడ్డుగుంట వెళ్లకుండా ప్రక్కన ఉన్న వెంచర్ గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ హైదరాబాద్ నుంచి సిమెంట్ గూనాలను తెప్పించి ఆ రహదారికి మరమ్మతులు చేయించారు. సర్పంచ్ గా ఎన్నికైన తక్కువ కాల వ్యవధిలోనే తన మార్కు చూపించి ఔరా అనిపించినా సర్పంచ్ ని గ్రామస్తులు, మండల ప్రజలు అభినందించారు.






