- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
దిశ నేరేడుచర్ల /మఠంపల్లి: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పిన కారు, ఆగి ఉన్న లారీని వేగంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్రగాయలైన సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మర్రపూడి ప్రసాద్ కారులో కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గోర్రెపాటి శ్రీనివాసరావు, అలాగే ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలోని ఖానపురం గ్రామంలోకి చెందిన బెట్టె నాగేశ్వరరావులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆ పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో గోర్రెపాటి శ్రీనివాసరావు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న మర్రపూడి ప్రసాద్ అలాగే నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రసాదును విజయవాడ నాగేశ్వరావును ఖమ్మం మెరుగైన వైద్యం ఆసుపత్రులకు తరలించారు.