- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు నా కొడకా.. హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
నగరంలో ‘హైడ్రా’ (HYDRA) కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్డెస్క్: నగరంలో ‘హైడ్రా’ (HYDRA) కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పేదోళ్ల ఇండ్ల కూల్చివేతలపై మరోసారి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) సర్కార్పై ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన జవహర్ నగర్ (Jawahar Nagar)లో మాట్లాడుతూ.. 30, 60 గజాల్లో ఇళ్లు కట్టుకుంటోడు ఉన్నోడా, లేనోడా ముర్ఖుల్లారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కళ్లు కనబడటం లేదా అంటూ ఫైర్ అయ్యారు. బంజారా హిల్స్ (Banjara Hills)లో ఎకరా రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.100 కోట్ల భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని ఆరోపించారు. వాటిని రిజిస్టర్ చేయడానికి జీవో నెం.58,59 తీసుకొచ్చారు కదరా.. నా కొడకా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పేదోళ్ల బతుకుల్లో మట్టి కొడితే ఏమోస్తుందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, వారి ఉసురు తప్పక తగులుతుందని పేర్కొన్నారు. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి కూల్చేస్తున్నారని ఇళ్లను నేలమట్ట చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా నిరుపేదల విషయంలో సర్కార్ పిచ్చి వేషాలు మానేయాలని.. లేని పక్షంలో భారీ ఉద్యమం తప్పదని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.






