టీఆర్ఎస్‌లో చేరిన మునుగోడు MPTC

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్‌లో చేరిన మునుగోడు MPTC
X

దిశ, మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. గెలుపే లక్ష్యంగా మండలంలోని ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధును తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రానికి చెందిన ఇండిపెండెంట్ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్, చండూరు మండల కేంద్రానికి చెందిన మున్సిపాలిటీ కో-ఆప్షన్ నెంబర్ ఎండీ సయ్యద్ వహీద్‌లు మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి టీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు నిరంతరం కృషి చేయాలని వారికి మంత్రి సూచించినట్లు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


Next Story