TG: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ జీవో జారీ.. స్పందించిన బీజేపీ MP ఆర్.కృష్ణయ్య

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం బీసీ సంక్షేమశాఖ జీవో విడుదల చేసింది.

TG: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ జీవో జారీ.. స్పందించిన బీజేపీ MP ఆర్.కృష్ణయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం బీసీ సంక్షేమశాఖ జీవో విడుదల చేసింది. తాజాగా ఈ జీవోపై బీజేపీ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య(MP R.Krishnaiah) స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అభినందనలు తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందనే నమ్మకం కలుగుతోందని అన్నారు. మ‌రోవైపు లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశానికి సీఎస్ రామ‌కృష్ణారావు, డీజీపీ జితేంద‌ర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

Next Story