ఇకనైనా కేసీఆర్ సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నా: MP కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
ఇకనైనా కేసీఆర్ సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నా: MP కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్ల తరువాత రాజ భవనం లాంటి సెక్రటేరియెట్​కట్టుకుని ఇవాళ పలు దస్త్రాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఇకనైనా నిత్యం సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సచివాలయ నిర్మాణానికి రూ.వెయి కోట్లు ఖర్చవుతాయని చెప్పి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలయిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్ ఆయన ఆశయాలను కొనసాగించడంలో విఫలమయ్యారని విమర్శించారు.



Next Story

Most Viewed