- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రావడంలేదు: ఎంపీ ఈటల రాజేందర్
బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం లేదని చెప్పారు. గ్రామాలు వల్లకాడులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం లేదని చెప్పారు. గ్రామాలు వల్లకాడులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు నిధులు వస్తేనే వీధి దీపాల ఏర్పాటు ఇతర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. రెండేళ్ల నుండి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండదని అన్నారు. గ్రామంలో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవాళ్లనే గెలిపిస్తారని చెప్పారు. తమకు తెలిసినవాళ్లు, పనిచేసేవాళ్లనే గెలిపించుకుంటామని అన్నారు. సర్పంచ్ లుగా, ఎంపీటీసులుగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ముందుగా గతంలో సర్పంచులుగా పనిచేసినవాళ్ల బిల్లులు క్లియర్ చేయాలని సూచించారు. బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.






