- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arvind Dharmapuri: బీఆర్ఎస్ పాలనలో మొదలైన ముప్పు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
మాజీ సర్పంచ్ వంశీ కృష్ణ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి చేత దారుణంగా కత్తితో దాడి చేయబడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ మాజీ సర్పంచ్ వంశీ కృష్ణ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి చేత దారుణంగా కత్తితో దాడి చేయబడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స జరుగుతోందని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో మాదకద్రవ్యాల ముప్పు బీఆర్ఎస్, కేటీఆర్ పాలనలోనే మొదలై.. పట్టణాలు, గ్రామాలు అంతటా లోతుగా వ్యాపించిందని ఆరోపించారు. ఈ తీవ్రమైన సామాజిక సమస్యను వారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో చట్ట-వ్యవస్థ వైఫల్యంగా మారిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ కూడా ఈ ముప్పును అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. యువత భవిష్యత్తును కాపాడడానికి, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాన్ని, వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం అత్యవసరం అని ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






