టీ.కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. MP అభ్యర్థి తల్లి కన్నుమూత

by Disha Web Desk 9 |
టీ.కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. MP అభ్యర్థి తల్లి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మీభాయి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పరిస్థితి విషమించి శనివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని అరవింద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా, బలరాం నాయక్ తల్లి లక్ష్మీభాయ్ మృతి పట్ల మంత్రి పొన్నం సోషల్ మీడియా వేదికన సంతాపం తెలియజేశారు. ‘లక్ష్మి భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బలరాం నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని వేడుకుంటున్నట్లు ప్రకటించారు.

Next Story

Most Viewed