అసలు ఏ దేశంలో ఉన్నాం..? ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన MP Bandi Sanjay

by Disha Web Desk 19 |
అసలు ఏ దేశంలో ఉన్నాం..? ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన MP Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: భైంసాకు భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర అని టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత సందర్భంగా బైంసాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బండి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఉన్న భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా హిందువాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు కూడా కొట్టేస్తామని.. వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది కాషాయజెండానే అని దీమా వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం నేతలు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. దేశం కోసం, ధర్మం కోసం పోరాడే బీజేపీ నేతలపై మాత్రం నిషేదమా..? అని మండిపడ్డారు. అసలు మనం ఏ రాష్ట్రంలో.. ఏ దేశంలో ఉన్నామని ఫైరయ్యారు. కేసీఆర్ అప్పు చేసిన ఐదు లక్షలు కోట్లు ఏమైపోయాయని ప్రశ్నించారు.

Y. S. Sharmila అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్


Next Story

Most Viewed