పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి మోడీ ఎవరు?

by Disha Web Desk 2 |
పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి మోడీ ఎవరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎందుకు ప్రారంభించబోతున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వాహక విభాగానికి మాత్రమే అధిపతి అని శాసన శాఖకు కాదని అన్నారు. భారత రాజ్యాంగం అధికారాల విభజన సూచించిందని కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ ప్రారంభించాలని అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ తన స్నేహితులు స్పాన్సర్ చేసిన ప్రైవేట్ నిధులతో నిర్మించినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాగా కొత్త పార్లమెట్ భవనాన్ని ప్రారంభించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆహ్వానించండపై ఒవైసీ శుక్రవారం పై రీతిగా స్పందించారు. ఈ నెల 28వ తేదీన పార్లమెంట్ న్యూ బిల్డింగ్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

ఇవి కూడా చదవండి:

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన

Next Story

Most Viewed