‘ఎన్నికల కోసమే MP అర్వింద్ పసుపు బోర్డు డ్రామా’

by Disha Web Desk 2 |
‘ఎన్నికల కోసమే MP అర్వింద్ పసుపు బోర్డు డ్రామా’
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే అర్వింద్ పసుపు బోర్డు డ్రామా ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా కుల, మతాల మధ్య గొడవలు పెట్టడం, రెచ్చగొట్టడం తప్ప అర్వింద్ ఎక్కడా అభివృద్ధి చేయలేదని అన్నారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 నుంచి 15 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అర్వింద్.. లోక్‌సభ ఎన్నికల్లో అదే ఫలితం చవిచూస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజార్టీతో నిజామాబాద్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని అన్నారు.



Next Story