Kavitha: భారత రెజ్లర్ల పోరాటంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Kavitha: భారత రెజ్లర్ల పోరాటంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. అత్యంత ప్రతిభగల అథ్లెట్లకు భారత్ నిలయంగా ఉందని.. అలాంటి వారికి సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. మన అథ్లెట్లు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారని ఎందరో అథ్లెట్లు మనకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో వైపు బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో రెజ్లర్లు స్పందించారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ ఫోన్ కాల్స్‌కు బదులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read..

ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ!

వేసవిలో ఈ మసాలా దినుసులు తినాలా? వద్దా?వంటింటి గృహిణులు తప్పక తెలుసుకోవాలి



Next Story

Most Viewed