MLC Kavitha: శైలజ కుటుంబానికి MLC కవిత ఆర్థికసాయం

by Gantepaka Srikanth |
MLC Kavitha: శైలజ కుటుంబానికి MLC కవిత ఆర్థికసాయం
X

దిశ, వెబ్‌డెస్క్: వాంకిడి గురుకుల పాఠశాల(Wankidi Gurukula School)లో విషపూరిత ఆహారం తిని మృతిచెందిన విద్యార్థిని శైలజ కుటంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అండగా నిలిచారు. శైలజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. త్వరలో బాధిత కుటుంబాన్ని కలిసి రూ.2 లక్షల ఆర్థిక అందజేస్తామని ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఆ కుటుంబానికి తగిన ఆర్థికసాయం చేయడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు శైలజ హైదరాబాద్ నిమ్స్‌లో మృత్యువుతో పోరాడి మరణించింది. ఆమెతో పాటు మొత్తం 63 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించి అధికారులకు వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed