Hyderabad MLC election: ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్.. కాంగ్రెస్ ఓట్లు ఎటువైపు?

by Prasad Jukanti |   ( Updated:2025-04-23 12:15:34.0  )
Hyderabad MLC election: ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్..  కాంగ్రెస్ ఓట్లు ఎటువైపు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (Hyderabad MLC Election) ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్ (BRS) మినహా బీజేపీ(BJP), ఎంఐఎం (MIM), కాంగ్రెస్ (Congress) ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే బీఆర్ఎస్ పోలింగ్ గు దూరంగా ఉండటం, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంతో ఫలితంపై ఉత్కకంఠ నెలకొంది.

క్రాస్ ఓటింగ్ తో ఎవరికి ముప్పు?

ఈ ఎన్నికలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉండగా ఓడిపోతామని తెలిసినా బీజేపీ బరిలోకి దగడంతో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండటం, కాంగ్రెస్ పోలింగ్ లో పాల్గొనడం రాజకీయాన్ని మరింత రసకందాయంలో పరేసింది. అధికార కాంగ్రెస్ ఓట్లు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది. పోలైన మొత్తం ఓట్లలో యాబై శాతానికి ఒక్క ఓటు ఎక్కువ ఎవరికి లభిస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో 88 ఓట్లు పోలవగా ఇందులో పార్టీల మధ్య క్రాస్ ఓటు జరిగిందా అనేది ఉత్కంఠగా మారింది.



Next Story

Most Viewed