మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే సండ్ర

by Disha Web Desk 2 |
మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ గారి మార్గం అనుసరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు టౌన్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ కే.సుజాత, కౌన్సిలర్లు చాంద్ పాషా, కంటే నాగలక్ష్మి, మట్ట ప్రసాద్, గుండ్ర రఘు, అద్దంకి అనిల్, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వల్లభనేని పవన్, నాయకులు మాధురి మదు, మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు, వేములపల్లి మధు, అబ్దుల్లా, అమరవరపు కృష్ణారావు, మిద్దె శీను, కో-ఆప్షన్ సభ్యులు రూత్ క్రిష్టియన్, తడికమల్ల ప్రకాష్ తదితులున్నారు.


Next Story