ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నేడు HighCourtలో కీలక విచారణ

by Disha Web Desk 4 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నేడు HighCourtలో కీలక విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి నేడు హైకోర్టులో కీలక విచారణ సాగనుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ కొనసాగనుంది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేసారు. సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్ దాఖలు అయిన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ పని చేస్తుందని ఇలా అయితే పారదర్శక విచారణ సాగదని పిటిషనర్లు వాదిస్తున్నారు. కాగా ప్రభుత్వం మాత్రం సిట్ దర్యాప్తు సజావుగానే సాగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ కొనసాగనుంది.

Read More....

KCR నేషనల్ పాలిటిక్స్.. నార్త్ నమ్మేదెలా!


Next Story

Most Viewed