ఈడీ ఆఫీసులో కిషన్ రెడ్డి.. స్టేట్మెంట్ రికార్డు చేస్తోన్న అధికారులు

by Disha Web Desk 2 |
ఈడీ ఆఫీసులో కిషన్ రెడ్డి.. స్టేట్మెంట్ రికార్డు చేస్తోన్న అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: క్యాసినో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫెమ నిబంధనల్ని ఉల్లంఘించారని ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేయగా.. మంగళవారం ఎమ్మెల్యే ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎమ్మెల్యే స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎమ్మెల్యే క్యాసినో ఆడినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టీఆర్ఎస్ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తోంది. కవిత నుంచి వరుసగా ఈడీ అధికారులు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Next Story

Most Viewed