చేరికలు సరే.. ఫస్ట్ వాళ్లకు టికెట్స్ ఇవ్వండి.. స్క్రీనింగ్ కమిటీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

by Disha Web Desk 19 |
చేరికలు సరే.. ఫస్ట్ వాళ్లకు టికెట్స్ ఇవ్వండి.. స్క్రీనింగ్ కమిటీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్, చైర్మన్‌లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీలను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులను ప్రోత్సహిస్తూనే.. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

ప్రస్తుతం అభ్యర్థుల దరఖాస్తులపై పీఈసీ ఇచ్చిన నివేదికను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది. ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక చేరుతుంది. అయితే ఓ వైపు పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం వడపోత కార్యక్రమం జరుగుతుంటే.. మరోవైపు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలోని ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో కొత్త చేరికల వల్ల తమ టికెట్‌కు ఎక్కడ ఎసరు పడుతుందోనని పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed