కోమటిరెడ్డి మంచోడు.. పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తారు: జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
కోమటిరెడ్డి మంచోడు.. పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తారు: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ కోమటిరెడ్డి మంచోడని, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కితాబిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి నష్టం చేసేలా కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామన్నారు. త్వరలో తాను కూడా పాదయాత్రను ప్రారంభిస్తానని, రూట్ మ్యాప్​తయారు చేస్తామన్నారు. పార్టీ పరిస్థితులపై తాను థాక్రేకు వివరించానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని థాక్రే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed