కేసీఆర్‌ కాళ్ళు మొక్కిన మంత్రులు.. వారికి పాదాభివందనం చేసిన సీఎం

by Disha Web Desk 4 |
కేసీఆర్‌ కాళ్ళు మొక్కిన మంత్రులు.. వారికి పాదాభివందనం చేసిన సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సచివాలయాన్ని ప్రారంభించి ఆరో అంతస్తులోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలను తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, మంత్రులు సీఎం కేసీఆర్‌ను అభినందించారు. ముహూర్తం సమయానికే సీట్లో కూర్చుని ఆరు ఫైళ్ళపై సంతకం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కాళ్ళు మొక్కారు. కానీ కేసీఆర్ మాత్రం ఆశీర్వచనాలు అందించిన వేద పండితుల కాళ్ళకు నమస్కరించారు.



Next Story

Most Viewed