Uttham Kumar Redy: యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Uttham Kumar Redy: యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు (paddy procurement) ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు యాసంగి సీజన్‌కు (yasangi crop) సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy) తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అధిగమించామని, ఈ విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో 2023 మే 15న యాసంగి సీజన్‌లో 23.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారని తెలిపారు. కాగా ఈ సీజన్‌లో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

Next Story