బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 19 |
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలోకి ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు వామపక్షాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు.

Read More...

టచ్‌లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్


Next Story

Most Viewed