ఆ విషయం చెప్పి కేంద్ర మంత్రిని ఆశ్చర్యపరిచిన శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 2 |
ఆ విషయం చెప్పి కేంద్ర మంత్రిని ఆశ్చర్యపరిచిన శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ శుక్రవారం భేటీ అయ్యారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతోన్న జాతీయ క్రీడల్లో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సందర్భంగా అనురాగ్ ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అందిస్తున్న వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న అంశంపై కేంద్రమంత్రి ఆశ్చర్యపోయారు. కామన్ వెల్త్ క్రీడల్లో దేశంలో రెండో స్థానంలో నిలిచినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భేటీలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు.



Next Story

Most Viewed