అక్రమ మద్యం సరఫరాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Dishafeatures2 |
అక్రమ మద్యం సరఫరాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా రాష్ట్రానికి దిగుమతి అవుతున్న అక్రమ మద్యం నివారణపై ఉక్కు పాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని విమానాశ్రయం ,రైల్వే, బస్సుల ద్వారా, ఇతర రవాణా మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం అరికట్టడానికి పూర్తిస్థాయిలో విస్తృత తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్రమ మద్యం రవాణా పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు రైల్వే, బస్ స్టేషన్, అంతర్ రాష్ట్ర బస్సు రవాణా ఆపరేటర్ల కు తెలిసేలా నోటీసులు, ఇచ్చి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అదేశించారు. తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ ప్రకారం అనుమతి లేకుండా తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల మద్యం ఎంత చిన్న పరిమాణంలోనైనా తీసుకురావడం నేరమని, అందుకు సెక్షన్ 34 (1) ప్రకారం లక్ష రూపాయల జరిమానా తో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదనే విషయం తెలిసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మద్యం ఇతర రాష్ట్రాల నుండి సరఫరా చేసే వ్యక్తులపై విధించే శిక్షను ప్రస్తుతం 5 సంవత్సరాల జైలు శిక్ష ను 7 సంవత్సరాలకు పెంచెలా ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ యజమానులు, ఈవెంట్ నిర్వాహకులు, కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు, బ్యాంకెట్ హాల్ నిర్వాహకులు, హోటల్ నిర్వాహకులకు అక్రమ మద్యం సరఫరాపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించకుండా అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మద్యం సరఫరా పై పోలీస్, రెవెన్యూ, RTA అధికారుల సహకారం, సమన్వయంతో గుడుంబా తయారీ, బెల్లం సరఫరా ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారలను ఆదేశించారు. డిఫెన్స్ క్యాంటీన్ల లోనీ మద్యాన్ని బయటి వ్యక్తులకు అమ్మటంపై నిఘా పెట్టి తగు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అంతర్ రాష్ట్ర రవాణా సర్వీసులైన కార్గో, పార్సల్ సర్వీసులు నిర్వహిస్తున్నా వారికి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం సరఫరా కాకుండా వారికి నోటీసు లు ఇవ్వాలని అదేశించారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారి వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందించే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, సమర్థవంతంగా పనిచేసే ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, పోస్టింగ్ లలో ప్రయారిటీని అందిస్తామన్నారు. అదేవిధంగా నేరాలను ప్రోత్సహించే వారిని గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ కుమార్ జాయింట్ కమిషనర్లు ఖురేషి, KAB శాస్త్రి, సహాయ కమిషనర్లు చంద్రయ్య గౌడ్ ,శ్రీనివాస్, ES లు ఏ. సత్యనారాయణ P. రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయభాస్కర్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed