అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-22 17:31:25  IST  )

‘సేవే నిజమైన సంపద’ అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సేవే నిజమైన సంపద’ అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్‌లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. శ్రీ అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Next Story