- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విక్టోరియా పార్లమెంట్ను సందర్శించిన మంత్రి శ్రీధర్బాబు.. శాసనాల తయారీపై కీలక వ్యాఖ్యలు
శాసనాల తయారీలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనాల తయారీలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు (Minister Sridhar Babu) అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శుక్రవారం (Victoria Parliament) విక్టోరియా పార్లమెంట్ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్ను వారికి వివరించారు.
ట్రాన్స్పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. తెలంగాణ-విక్టోరియా మధ్య ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ను పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ తార్లామిస్, షీనా వాట్ తెలిపారు. తెలంగాణ- విక్టోరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






