కీలకమైన రెండు ఫైళ్లపై సంతకం చేసిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి

by Disha Web Desk 12 |
కీలకమైన రెండు ఫైళ్లపై సంతకం చేసిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ. 34.25 కొట్లతో ట్యాబ్‌లను, 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్‌లను ఏర్పాటు చేసే ఫైళ్ళ పై నూతన సచివాలయంలో తొలి సంతకం చేసిన విద్యా శాఖ మంత్రి పి.ప్ సబితా ఇంద్రారెడ్డి. పాఠశాలలను పునః ప్రారంభించే నాటికి (జూన్ 12) ట్యాబ్‌లను ఉపాధ్యాయులకు అందిస్తామని తెలిపారు. లైబ్రరీ కార్నర్‌లను కూడా జూన్ 12 వ తేదీ నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. నూతన సచివాలయం మొదటి అంతస్తులోని ‘బి వింగ్’ కార్యాలయం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక నుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.



Next Story

Most Viewed