రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను మోసం చేశావ్: తుమ్మలపై పువ్వాడ ఫైర్

by Disha Web Desk 19 |
రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను మోసం చేశావ్: తుమ్మలపై పువ్వాడ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. మంళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని తుమ్మల ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు.. లేదంటే దొంగ ఓటా అని ప్రశ్నించారు. మమత కాలేజీ విద్యార్థులపై కక్షపూరితంగా ఈసీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో తుమ్మల ఈ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌ను మోసం చేశాడు.. రాజకీయంగా ఆదుకున్న చంద్రబాబు, కేసీఆర్‌లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లా నుండి ఆయన మంత్రి పదవికి అడ్డువస్తున్నానని నన్ను ఓడించేందుకు కూడా తుమ్మల యత్నించారని ఆరోపించారు.


Next Story