రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు: మంత్రి

by Disha Web Desk 2 |
రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు: మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భోగి పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, ఈవో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలకు కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకం అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడు కొందరివాడు కాదు.. అందరివాడు అని మంత్రి పేర్కొన్నారు.

Next Story