Yadagirigutta: యాదగిరిగుట్టలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

by Ramesh Naini |

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ

అలాగే యాదగిరిగుట్టలో నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు-2026 పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా 2026 జనవరి నెలంతా రోడ్డు భద్రతను ప్రధాన ఎజెండాగా తీసుకొని పని చేస్తామని వెల్లడించారు. జనవరి 1 నుంచి 31 వరకు ‘రోడ్డు భద్రతా మాసోత్సవం’ నిర్వహించి, రోడ్డు భద్రతకు సంబంధించి 31 రోజుల సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story