TS నుంచి TGగా మార్పు.. కొత్త రిజిస్ట్రేషన్లపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
TS నుంచి TGగా మార్పు.. కొత్త రిజిస్ట్రేషన్లపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణిచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఉద్యమ నాయకులను మోసం చేశారని గుర్తుచేశారు. విపక్షాలను గౌరవించకుండా రాచరిక పోకడలను అవలంభించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం TG అనే రాసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రజల మనోభావాల మేరకువ టీజీని టీఎస్‌గా మార్చుతున్నామని అన్నారు. దీనిని శాసనసభ కూడా ఆమోదించిందని గుర్తుచేశారు. పేరు మార్పునకు కేంద్రం కూడా ఒప్పుకున్నదని వెల్లడించారు. రేపటి నుంచే మార్పు మొదలు కానుందని.. ఇకపై అన్ని వాహనాలపైనా టీజీ అనే ఉండబోతుందని అన్నారు.

Next Story