భారీ వర్షాలు.. అవసరమైతే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి: అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష

by Ramesh Naini |

రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

భారీ వర్షాలు.. అవసరమైతే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి: అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (heavy rains) ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆదేశించారు. గోదావరి కృష్ణా న‌దీ ప‌రివాహాక ప్రాంతాల్లో వీలైనంత‌వ‌ర‌కు ప్రాణ, ఆస్ధీ, ఆర్ధిక న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టి నుండే ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకొంటూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను సూచించారు. గోదావ‌రి , కృష్ణా న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద నిర్వ‌హ‌ణ‌పై ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లతో గురువారం స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఉన్న‌త‌స్ధాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత స్పందించేదానికంటే నష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్ర స్దాయిలో ప్ర‌ధానంగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌లు, విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై హైడ్రా క‌మీష‌న‌ర్, అగ్నిమాప‌క డీజీ, విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మీష‌న‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ డైరెక్ట‌ర్, నీటిపారుదల‌, ఆర్ & బీ, ఆరోగ్య శాఖ‌ల క‌మీష‌న‌ర్ల‌తో ఉన్న‌త స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఈ క‌మిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుంద‌ని క‌మిటీ నివేదిక ప్ర‌కారం చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని వెల్లడించారు.

ఈ ఏడాది వ‌ర్షాకాల సీజ‌న్ అనుకున్న‌దానికంటే 15 రోజుల ముందుగానే వ‌చ్చింద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అన్ని విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌కృతి వైప‌రీత్యాల ప్ర‌భావం వీలైనంత‌వ‌ర‌కు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాలలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హ‌ఠాత్తుగా వ‌చ్చే వ‌ర్షాల‌ వల్ల ఊహించని వరదలు వస్తున్నాయ‌ని, గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టి నుంచే ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.

ముఖ్యంగా ప‌రీవాహ‌క ప్రాంతాల్లోని నివాసితుల‌ను గుర్తించి వారిని అక్క‌డి నుంచి శాశ్వ‌తంగా త‌ర‌లించి వారికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గ‌త ఏడాది గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వ‌ర్షం ప‌డ‌డం వ‌ల్ల న‌ష్టం ఎక్కువగా జ‌రిగింద‌ని ఈ సారి కూడా అటువంటి ప‌రిస్ధితి ఎదురైతే న‌ష్టాన్ని త‌గ్గించే విధంగా ముంద‌స్తుగా ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు.

Next Story