భగ్గుమన్న వర్గపోరు.. సుధీర్ రెడ్డి వద్ద మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి

by Disha Web Desk 2 |
భగ్గుమన్న వర్గపోరు.. సుధీర్ రెడ్డి వద్ద మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి మల్లారెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేదికమీదే పోట్లాడుకోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తుండగా.. మంత్రి మల్లారెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం వేదికమీదే ఇద్దరు వాగ్వాదానికి దిగారు. బోడుప్పల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీ చైర్మన్‌ను ఆహ్వానించలేదని సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.




Next Story

Most Viewed